News March 11, 2025
అనర్హులని తేలితే ఏదశలో ఉన్నా ఇల్లు రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎంపిక చేసి పనులు ప్రారంభించామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పనులు ప్రారంభించామని.. లబ్ధిదారులు అనర్హులని తేలితే నిర్మాణం ఏ దశలో ఉన్నా ఎలాంటి ఆలోచన లేకుండా ఇల్లు రద్దు చేస్తామని తేల్చిచెప్పారు.
Similar News
News March 15, 2026
అన్నమయ్య: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్త అరెస్ట్

రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయనపల్లిలో జరిగిన కృష్ణవేణి అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త శ్రీనివాసులును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కృష్ణవేణి బెడ్రూమ్లో ఉరివేసుకుంటుండగా, కాపాడకపోగా శ్రీనివాసులును సెల్ఫోన్లో వీడియో తీస్తూ సరిగ్గా వేసుకో అంటూ నవ్వుతూ వెటకారం చేశాడు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో సెక్షన్ 108 BNS కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News March 15, 2026
అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
‘భీష్మ ప్రతిజ్ఞ’ అంటే ఏమిటి?

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్ల గురించి చెప్పే సందర్భంలో ‘భీష్మ ప్రతిజ్ఞ’ నానుడిని వాడతారు. భారతంలో భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. అతని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె సత్యవతిని రెండో వివాహం చేసుకోవాలనుకుంటాడు. తన కూతురి కొడుకే రాజు కావాలని దాశరాజు కోరగా తండ్రి ఆనందం కోసం దేవవ్రతుడు అంగీకరించి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతారు. అందుకే ఆయనకు భీష్ముడిగా పేరు వచ్చింది.
<<-se>>#EPICSAYINGS<<>>


