News March 11, 2025
ఆ కారు ఉత్పత్తిని ఆపేయనున్న మారుతీ?

తమ సెడాన్ కారు సియాజ్ ఉత్పత్తిని ఇకపై ఆపేయాలని మారుతీ సుజుకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆ కారును సంస్థ తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సియాజ్కు ఆదరణ బాగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 7726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు పోటీ సంస్థల నుంచి సిటీ, విర్చస్, స్లేవియా, వెర్నా వంటి కార్లు దూసుకెళ్తుండటంతో సియాజ్ ఉత్పత్తిని ఇక నిలిపేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
Similar News
News March 11, 2025
Xను హ్యాక్ చేసింది మేమే: Dark Storm Team

ప్రపంచవ్యాప్తంగా X (ట్విటర్) సేవల్లో అంతరాయానికి తామే కారణమని హ్యాకింగ్ గ్రూప్ ‘Dark Storm Team’ ప్రకటించుకుంది. ఈ సైబర్ అటాక్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, తమ బలాన్ని నిరూపించుకునేందుకే చేశామని స్పష్టం చేసింది. ఈ Dark Storm Team పాలస్తీనాకు అనుకూలంగా ఉంటుంది. హై సెక్యూరిటీ సిస్టంలను కూడా సులభంగా హ్యాక్ చేస్తుందన్న గుర్తింపు ఉంది. నాటో, ఇజ్రాయెల్, దాని అనుకూల దేశాల సైట్లను టార్గెట్ చేసింది.
News March 11, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 నెలలుగా వైద్యం అందిస్తున్నా నరాల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు తెలిపారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని, ఎవరినీ గుర్తుపట్టట్లేదని చెప్పారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్లో ఫుడ్ ఇస్తున్నామన్నారు. శరీర కదలిక కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని చెప్పారు.
News March 11, 2025
శబరిమల: 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.