News March 11, 2025
ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.
Similar News
News March 23, 2026
దృశ్యం-3 రిలీజ్ వాయిదా

మలయాళ నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్లాల్ ఇన్స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.
News March 23, 2026
విశాఖ: యాక్సిడెంట్.. తల్లి కళ్ల ఎదుటే కుమార్తె మృతి

పాత గాజువాక జంక్షన్లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. కొరమండల్ ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు స్కూటీపై వెళుతుండగా లారీ ఢీకొనడంతో కుమార్తె మల్లపురెడ్డి స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గాజువాక జంక్షన్లో కలకలం రేగింది. కళ్ల ఎదుట కూతురు చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోయింది. ఈ ప్రమాదంలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 23, 2026
MNCL: పదో తరగతి పరీక్షకు 22 మంది గైర్హాజరు

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. సోమవారం జరిగిన తృతీయ భాషా పరీక్షకు మొత్తం 9,690 మంది విద్యార్థులకు గాను 9,668 మంది హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,683 మందికి 9,663 మంది హాజరు కాగా, గతంలో ఫెయిలైన ఏడుగురిలో ఐదుగురు పరీక్ష రాశారు. మొత్తం 22 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.


