News March 11, 2025

ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News March 11, 2025

HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

image

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లో‌కైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.

News March 11, 2025

పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేయాలి: ఎస్పీ

image

సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ఈరోజు జరిగిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని అన్నారు.నేర నియంత్రణలో బాగంగా అన్నీ ప్రాంతాలలో సిసిటివి కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు,సిబ్బంది పని పనిచేయాలని ఆదేశించారు.

News March 11, 2025

నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

image

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

error: Content is protected !!