News March 11, 2025
కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.
Similar News
News September 15, 2025
అంతర పంటల సాగుతో ఆర్థికాభివృద్ధి: భద్రాద్రి కలెక్టర్

అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ములకలపల్లి మండలం ముకమామిడి గ్రామపంచాయతీ పరిధిలోని గట్టగూడెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వెదురు సాగును కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి రైతు సాంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలన్నారు. అంతర పంటల సాగు ద్వారా తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు.
News September 15, 2025
రేపు భారత్-అమెరికా వాణిజ్య చర్చలు

భారత్, అమెరికా మధ్య రేపు వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇవాళ రాత్రి US చీఫ్ నెగోషియేటర్, ట్రంప్ సహాయకుడు బ్రెండన్ లించ్ భారత్ చేరుకోనున్నారు. ట్రేడ్ డీల్పై పరస్పరం చర్చలకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్తో పాటు ప్రధాని మోదీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.
News September 15, 2025
NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.