News March 11, 2025

మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

image

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.

Similar News

News August 9, 2025

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నంబర్లకు ఫోన్ చేయండి: ఎస్పీ

image

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే డయల్ 100/112 లేదా సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లాలోని వాహనదారులు అధిక శబ్దంతో కూడిన స్పీకర్లు, సైలెన్సర్లు ఉపయోగించి అధిక వేగంగా వెళ్లరాదన్నారు. బైక్‌పై త్రిబుల్ రైడింగ్ చేయరాదని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణీకులను తీసుకెళ్లరాదన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదన్నారు.

News August 9, 2025

అనంత జిల్లాలో 746 కేసులు నమోదు

image

అనంతపురం జిల్లాలో 76 ఓపెన్ డ్రింకింగ్, 44 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై 626 ఎంవీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రూ.2,27,046 జరిమానాలు విధించామన్నారు. 42 పోలీసు స్టేషన్ల పరిధిలో అక్కడి పోలీసులు విజిబుల్ పోలీసింగ్‌ నిర్వహించి, వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News August 7, 2025

స్పెషల్ డ్రైవ్.. 146 కేసులు నమోదు

image

డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో తనిఖీలు నిర్వహించి 53 డ్రంకన్ డ్రైవ్ కేసులు, 93 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు జిల్లాలో డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.