News March 11, 2025

పుట్టపర్తి: అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ

image

పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 218 అర్జీలు వచ్చినట్లు సోమవారం అధికారులు తెలిపారు. గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, రీ సర్వే పనులకు సంబంధించి అర్జీలు ప్రజల నుంచి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం ఎందుకు కాలేదో అర్జీదారులకు తెలపాలన్నారు.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. పెద్దపల్లి జిల్లాకు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందుతాయని తెలిపారు. అలాగే జిల్లాలో బస్సు డిపో త్వరగా పూర్తిచేయాలని, పాలకుర్తి ఎత్తిపోతల పథకం, సుందిళ్ల రిటరింగ్ ప్రహరీ నిర్మాణం, రామగుండంలో దంత, పాలిటెక్నిక్ కళాశాల, విమానాశ్రమం, అలాగే జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.

News March 12, 2025

నేడు బడ్జెట్… NZB జిల్లాకు ఏం కావాలంటే?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ప్రస్తుతం పసుపు రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర సమస్య విషయంలో చొరవ చూపాలని కోరుతున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చెప్పట్టాలని, జిల్లాలో ప్రభుత్వ ఇంజినీర్ కళాశాల నిర్మణానికి నిధులు కేటాయించాలి కోరుతున్నారు.

News March 12, 2025

మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది.

error: Content is protected !!