News March 11, 2025
ఐ.పోలవరం: మోసం చేసిన వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష

ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి చెందిన ముక్తేశ్వరరావుకు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించారని ఎస్సై మల్లికార్జున రెడ్డి సోమవారం తెలిపారు. ముమ్మిడివరం మెజిస్ట్రేట్ కోర్టు జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా ఈ తీర్పు ఇచ్చారన్నారు. జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021లో అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారన్నారు.
Similar News
News March 18, 2026
విశాఖ: గమనిక.. ఇవాళ వందే భారత్ టైమింగ్లో మార్పు

విశాఖపట్నం-దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (20830) బుధవారం రీషెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనుసంధాన రైలు ఆలస్యం కారణంగా సాయంత్రం 6:20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పు వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసింది.
News March 18, 2026
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే?

రాష్ట్రమంతటా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు DPTO శ్రీనివాస రావు బుధవారం తెలిపారు. జిల్లాలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం డిపోల నుంచి ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News March 18, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.


