News March 11, 2025
ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఆదోని పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జేఎఫ్సీఎం) అపర్ణ డిస్మిస్ చేశారు. మరోవైపు బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేశారు. నేడు వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత ఫిర్యాదుతో గతేడాది ఆదోని పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది.
Similar News
News March 13, 2026
దేశంలోనే భద్రాద్రి టాప్..!

దేశంలోనే అత్యధికంగా భద్రాద్రి పోలీసులు ఏడాది కాలంలో 6500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టుబడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మాట్లాడారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నారు.
News March 13, 2026
ధోనీ ఆ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కరెక్ట్ కాదు: పుజారా

CSK మాజీ కెప్టెన్ ధోనీ 8 లేదా 9వ స్థానంలో బ్యాటింగ్కు రావడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ పుజారా అన్నారు. ‘ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగలడు. కేవలం 5 లేదా10 కాకుండా 25-30 బంతులు ఆడితే జట్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ముందుగా బ్యాటింగ్కు వస్తే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది’ అని అభిప్రాయపడ్డారు. 44 ఏళ్ల ధోనీ గత సీజన్లో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
News March 13, 2026
విజయవాడ: అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లల్లో తనిఖీలు

విజయవాడలోని రౌడీషీటర్లపై పోలీసులు నిరంతర నిఘా పెడుతున్నారు. మాచవరం ప్రాంతంలో సీఐ వెంకటరమణ తన సిబ్బందితో గురువారం అర్ధరాత్రి రౌడీ షీటర్లు, అనుమానితుల గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రౌడీషీటర్లు తమ తమ ఇళ్లలోనే ఉన్నట్లు గుర్తించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు తరచుగా కొనసాగుతాయని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


