News March 11, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్

‘పుష్ప-2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 నెలలుగా వైద్యం అందిస్తున్నా నరాల పనితీరులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు తెలిపారు. కళ్లు మాత్రమే తెరుస్తున్నాడని, ఎవరినీ గుర్తుపట్టట్లేదని చెప్పారు. ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ ప్రాసెస్లో ఫుడ్ ఇస్తున్నామన్నారు. శరీర కదలిక కోసం ఫిజియోథెరపీ చేస్తున్నామని చెప్పారు.
Similar News
News March 12, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.
News March 12, 2025
MLAకు న్యూడ్ కాల్స్ చేసిన నేరగాళ్లు అరెస్ట్

TG: కాంగ్రెస్ MLA వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కిందట దుండగులు న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్కు చెందినవారిగా గుర్తించారు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిరేకల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
News March 12, 2025
Stock Markets: బ్యాంకు షేర్లకు గిరాకీ

స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,470 (-28), సెన్సెక్స్ 74,045 (-62) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. చమురు, ఎనర్జీ, PSE, PVT బ్యాంకు, కమోడిటీస్, ఫైనాన్స్, ఆటో, ఇన్ఫ్రా, మెటల్ షేర్లకు గిరాకీ పెరిగింది. ఐటీ, FMCG, హెల్త్కేర్, ఫార్మా, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇండస్ఇండ్, టాటా మోటార్స్, BPCL, కొటక్, HDFC బ్యాంకు టాప్ గెయినర్స్.