News March 11, 2025
విశాఖలోని 13 రైతు బజార్లలో నేటి కాయగూరల ధరలు

విశాఖలోని 13 రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయ ధరలను అధికారులు ఈ విధంగా నిర్ణయించారు.(రూ/కేజీలలో) టమాటా కేజీ రూ.13, ఉల్లి రూ.27, బంగాళాదుంప రూ.15, నల్లవంకాయలు రూ.30, బెండకాయలు రూ.42, మిర్చి రూ.32, దొండ రూ.38, బరబాటి రూ.38, క్యారెట్ రూ.30/38, వెల్లుల్లి రూ.90/100గా, బీట్ రూట్ రూ.24, కీరా రూ.22, గ్రీన్ పీస్ రూ.50, పెన్సిల్ బీన్స్ రూ.50, కాకర కాయ రూ.44, పొటల్స్ రూ.90, చేమదుంప రూ.34గా నిర్ణయించారు.
Similar News
News September 14, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ను మోదీ ఆదుకుంటున్నారు: మాధవ్

విశాఖ స్టీల్ ప్లాంట్ను వాజపేయి ఆదుకున్నట్టే నేడు మోదీ ఆదుకుంటున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. సారథ్యం యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమెరికా టారిఫ్లతో ఏపీలో పలు వర్గాలు నష్టపోతున్నాయని, ఆత్మనిర్భర్ భారత్ దీన్ని పరిష్కరించగలదని పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యమాన్ని ఏపీ బీజేపీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. బీజేపీని ఇంటింటికి విస్తరించడమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు.
News September 14, 2025
‘బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధిని వివరించండి’

దేశ ఆర్థిక వ్యవస్థ 2014లో 11వ స్థానంలో ఉండగా మోదీ నేతృత్వంలో ఇప్పుడు మూడో స్థానానికి చేరిందని
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రక్షణ రంగం, రహదారులు, పోర్టులు, రైల్వేలు, వైద్య కళాశాలలు, విమానాశ్రయాలు ఇలా అన్ని రంగాల్లో విస్తృత అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు. కార్యకర్తలు గ్రామ గ్రామానికీ వెళ్లి NDA అభివృద్ధిని వివరించాలని పిలుపునిచ్చారు.
News September 14, 2025
వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.