News March 11, 2025

ఆస్తి కోసమే.. తల్లిని హత్య చేశాడు!

image

నంద్యాల(D) ఉయ్యాలవాడలో నిన్న కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. పుల్లమ్మ (75) కొడుకు గురవయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల పుల్లమ్మ ఆస్తిని తన మనవడి పేరుపై రాసింది. దీంతో తన పేరుపై రాయించాలని తల్లితో గొడవపడేవారు. సోమవారం ఉదయం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు.

Similar News

News September 15, 2025

‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

image

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.

News September 15, 2025

DSC రిజల్ట్స్: స్టేట్ ఫస్ట్ ర్యాంక‌ర్‌ది మన విజయనగరమే

image

ఈరోజు విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన కడగల భవాని టి.జి.టి ప్రత్యేక భౌతిక శాస్త్రం విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం ఆమె మరడాం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త, తల్లిదండ్రులు, అత్త మామల సహకారం తనను ఈ స్థాయిలో నిలిపిందని ఆమె తెలిపారు. ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

News September 15, 2025

నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

image

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.