News March 11, 2025

సఖినేటిపల్లి: 26న నరసింహ స్వామి శాంతి కళ్యాణం

image

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం ఈ నెల 26వ తేదీ బుధవారం జరుగుతుందని ఆలయ ఈవో సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొన్న బహుళ ద్వాదశి సందర్భంగా ఉదయం 10 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. కళ్యాణం ముందస్తు టిక్కెట్లను www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా పొందాలన్నారు. ఆలయం కౌంటర్లో కూడా తీసుకోవచ్చన్నారు.

Similar News

News January 13, 2026

విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లకు ప్రత్యేక హాల్ట్

image

విశాఖ మీదగా వెళ్లే రైళ్లకు ప్రత్యేక హాల్టు కల్పించినట్లు వాళ్తేర్ డివిజన్ డీసీఎం పవన్ తెలిపారు.18525 బరంపూర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18 నుంచి తిలార్ స్టేషన్లో, 12844 అహ్మదాబాద్ పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 17 నుంచి ఇచ్చాపురంలో, 22819 భువనేశ్వర్ – విశాఖపట్నం ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 18 నుంచి బారువా స్టేషన్లో హాల్ట్ కల్పించినట్లు తెలిపారు.

News January 13, 2026

తిరుపతి: మళ్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మారుస్తారా..?

image

తిరుపతి శిల్ప కళాశాల ప్రాంతంలో టౌన్‌షిప్ ఏర్పాటుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏడీ బిల్డింగ్ దగ్గరలోని టీటీడీ ప్రెస్ వద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి గత బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అక్కడ కాదని టౌన్‌షిప్ ప్రతిపాదిత ఏరియాలో రూ.10 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు చేస్తున్నారు. ఇది పూర్తయి టౌన్‌‌షిప్‌కు అడ్డంగా మారితే.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మళ్లీ మార్చేస్తారే అనే సందేహం నెలకొంది.

News January 13, 2026

‘మెదక్ జిల్లాను ఛార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్‌లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.