News March 11, 2025
WGL: క్వింటా పత్తి ధర రూ.6,950

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. నిన్న పత్తి ధర క్వింటాకి రూ.6,960 పలకగా.. నేడు రూ.10 తగ్గి.. రూ.6,950కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారస్థులు తెలుపుతున్నారు.
Similar News
News January 1, 2026
వరంగల్: లక్ష్యసాధనకు పునరంకితం కావాలి: సీపీ

నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో ప్రారంభించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. 2026లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News January 1, 2026
WGL: సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శాంతి సమృద్ధి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజ శ్రేయస్సును కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని, సానుకూల ఆలోచనలు విజయానికి తొలిమెట్టు అని ఆమె ఉద్ఘాటించారు.
News December 31, 2025
మెరుగైన వైద్య సేవల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్: WGL కలెక్టర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా లోపాల దిద్దులుబాటకు 90 రోజుల యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్వో, ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించిన అధికారులతో బుధవారం సమీక్షించారు. వైద్య ఉద్యోగులకు ఫేస్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటల్స్ సూపర్డెంట్లు, అధికారులు పాల్గొన్నారు.


