News March 11, 2025

శ్రీరాంపూర్‌లో యువతి సూసైడ్

image

శ్రీరాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీ నగర్‌కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Similar News

News November 10, 2025

భువనగిరి: ‘జీవో నంబర్ 34ను అమలు చేయాలి’

image

దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని, జీవో నంబర్ 34ను వెంటనే అమలు చేయాలని సోమవారం కలెక్టర్ హనుమంతరావుకు NPRD జిల్లా అధ్యక్షుడు సురపంగా ప్రకాష్, జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి లలిత, జిల్లా ఉపాధ్యక్షురాలు పార్వతి, హరిబాబు, చందు, స్వామి, జెరీష, గోపి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News November 10, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌ ‘బరిలో పెద్దపల్లి యువకుడు’

image

పెద్దపల్లి(D) ఓదెల మండలం గూడెంకి చెందిన సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో స్థిరపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడం తమ బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, నియోజకవర్గంలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతర ఓటర్లున్నారు. ఓటు హక్కుతో దేశ ప్రగతిని నిర్మించవచ్చని ప్లకార్డులతో కాలనీల్లో పర్యటించారు.

News November 10, 2025

గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

image

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.