News March 11, 2025
శ్రీరాంపూర్లో యువతి సూసైడ్

శ్రీరాంపూర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్కే6 కొత్త రోడ్ ఏరియాలోని లక్ష్మీ నగర్కు చెందిన మెరుగు సౌమ్య సోమవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News November 10, 2025
ప్రజావాణికి 158 వినతులు.. సత్వర పరిష్కారంపై కలెక్టర్ ఆదేశం

హన్మకొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి 158 వినతి పత్రాలు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అర్జీలను స్వీకరించి, సత్వర పరిష్కారం కోసం సంబంధించిన శాఖలకు పంపించారు. గ్రీవెన్స్ వినతులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: తుల రవి

డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని అందించే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి తల రవి తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు ఈనెల 19వ తేదీలోగా వివిధ కేటగిరీలలోని పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకుhttps://wdsc.telangana.gov.in సంప్రదించాలన్నారు.
News November 10, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాలని అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు భాగస్వామ్యం కానున్నారని సూచించారు.


