News March 11, 2025
R5 జోన్ లబ్ధిదారులకు వేరే చోట స్థలాలు: నారాయణ

AP: రాజధానిపై కక్షతోనే అమరావతిలో మాజీ CM జగన్ R5 జోన్ క్రియేట్ చేశారని మంత్రి నారాయణ అన్నారు. అక్కడ సెంటు చొప్పున 50వేల మందికి ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని వారికి వేరేచోట స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో రాజధానికి 30K ఎకరాలు కావాలన్న జగన్ అధికారంలోకి వచ్చి మూడుముక్కలాట ఆడారని విమర్శించారు. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామని, కీలకమైన 185అడుగుల వెడల్పు రోడ్లు 2 ఏళ్లలో పూర్తవుతాయన్నారు.
Similar News
News January 27, 2026
ఇవాళ సా.4 గంటలకు ఎన్నికల షెడ్యూల్

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
News January 27, 2026
కాల్పులు ఆపాలని పాక్ వేడుకుంది.. UNలో ఇండియా కౌంటర్

ఇండియాకు, ఇండియాలోని ప్రజలకు హాని కలిగించడమే పాక్ ఏకైక అజెండా అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ UN వేదికగా మండిపడ్డారు. ‘మే 10న కాల్పుల విరమణ కోసం పాక్ వేడుకుంది. మా ఆపరేషన్లో పాక్ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి’ అని చెప్పారు. ఇండియా చేపట్టిన OP సిందూర్కు తాము బదులిచ్చామంటూ UNSCలో పాక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
News January 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <


