News March 11, 2025
మెదక్: యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. నార్సింగ్కు చెందిన యువకుడు స్వామి(38) ఇటీవల భార్య కాపురానికి రాకపోవడంతో మద్యంకు బానిసగా మారారు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన స్వామి వల్లూరు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News September 12, 2025
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మెదక్ మున్సిపాలిటీలోని గోల్కొండ వీధి, గాంధీనగర్లో వరద ప్రభావిత ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను రక్షించడానికి శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు.
News September 12, 2025
RMPT: చికిత్స పొందుతూ యువకుడి మృతి

15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. తొనిగండ్ల గ్రామానికి చెందిన మంగలి అనిల్ అనే వ్యక్తి జాన్సీ లింగాపూర్ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద 15 రోజుల క్రితం షాక్ తగలడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 12, 2025
శిథిల భవనాలకు ప్రతిపాదనలు అందజేయాలి: కలెక్టర్

జిల్లాలో వర్షం కారణంగా ప్రభావితమైన శిథిలావస్థలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలల భవనాలకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందజేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ కలెక్టరేట్ నుంచి డీఈవో, ఇంజినీరింగ్ అధికారులతో గూగుల్ మీట్ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 108 ఉన్నాయని వీటికి గడువులోగా నివేదికలు తయారు చేయాలన్నారు.