News March 11, 2025

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక

image

AP: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా CS విజయానంద్‌కు నివేదిక ఇచ్చారు. ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2024 NOV 15న రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ IAS రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.

Similar News

News November 16, 2025

SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

image

TG: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.

News November 16, 2025

మూడో రోజే ముగిస్తారా?

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజే ముగిసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 200 లోపు స్కోర్లకే ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన సౌతాఫ్రికా 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేవలం 63 పరుగుల లీడ్‌లో ఉంది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో మిగతా 3 వికెట్లు ఫస్ట్ సెషన్‌లోనే పడిపోయే ఛాన్స్ ఉంది.

News November 16, 2025

కార్తీక మాసంలో ఇవి ఆచరించలేదా?

image

కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేస్తారు. అయితే తులసి చుట్టూ ప్రదక్షిణలు, ఉసిరి చెట్టు పూజ, దాని కింద వనభోజనం, శివుడితో పాటు కేశవుడి కథలు కూడా వినడం, దానధర్మాల్లో పాల్గొనడం.. వంటివి కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి చేయకపోతే.. రేపు కార్తీక మాస చివరి సోమవారం రోజున ఆచరించవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో సకల పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం.