News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News September 16, 2025
HYD: ఫిలిం మేకింగ్పై పట్టుందా..? గెలిస్తే రూ.3 లక్షలు!

HYDలో ప్రొడ్యూసర్ దిల్ రాజు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరిట TFDC పోస్టర్ విడుదల చేశారు. సెప్టెంబర్ 30 వరకు 5 నిమిషాల షార్ట్ ఫిలిం, సాంగ్ వీడియో తీసి youngfilmmakerschallenge@gmail.com, 81258 34009 వాట్సప్కు పంపాలని చెప్పారు. మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండవ బహుమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఇస్తారు.
News September 16, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ గత 22 నెలల పాలన ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. రేవంత్ రెడ్డి భయంతో HYD ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు. నగరాభివృద్ధి కొనసాగాలంటే BRS మళ్లీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఉపఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచి విజయయాత్రను ప్రారంభించాలని సూచించారు.
News September 16, 2025
జగిత్యాల: ‘కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం’

కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన సదస్సు నిర్వహించారు. జూనియర్ విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే విద్యార్థులకు శిక్షలు తప్పవని హెచ్చరించారు.