News March 11, 2025
MBNR: సైబర్ మోసాలతో జర జాగ్రత్త..!

ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్లో ఓ గ్రూప్లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
Similar News
News January 18, 2026
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్: JNTU వీసీ

అనంతపురం JNTUలో ఆదివారం NTR వర్ధంతిని పురస్కరించుకొని వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి NTR విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినీ హీరోగా, సీఎంగా ఎదిగిన NTR జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
News January 18, 2026
పాక్ సరిహద్దుల్లో AK-47 రైఫిళ్లు, పిస్టళ్లు లభ్యం

పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో 3 AK-47 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు, తుర్కియే, చైనా తయారీ పిస్టళ్లు, 98 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్ నుంచి ఈ ఆయుధాలను పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్థ ISI అండ ఉన్న ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.
News January 18, 2026
HYDలో ఆదివారం AQ @189

HYDలో ఎయిర్ క్వాలిటీ గత వారంతో పోలిస్తే స్వల్పంగా మెరుగుపడింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ నగరంలో ఆదివారం తెల్లవారుజామున 189గా నమోదైంది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు మాస్కులు ధరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వాహనాల రద్దీ, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ తగ్గడంతో HYD ఊపిరితీసుకుంటోంది.


