News March 11, 2025

MHBD: ఈనెల 14 నుంచి వ్యవసాయ మార్కెట్ బంద్

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 14 నుంచి 16 వరకు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో మిర్చి పంట పోటెత్తినట్లు తెలిపారు. సుమారు 20 వేల బస్తాలు మార్కెట్లో ఉన్నాయని, రైతులు మిర్చి పంటను విక్రయానికి తీసుకురావొద్దని సూచించారు. ఈనెల 17 నుంచి మార్కెట్లో కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 5, 2025

జుక్కల్: పత్తి కూలీల కొరత.. రైతుల్లో గుబులు!

image

జుక్కల్ నియోజకవర్గంలో పత్తి రైతులకు కూలీల కొరత సమస్యగా మారింది. నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాల్లో సాగు చేసిన పత్తి కోత దశకు చేరుకుంది. అయితే, కూలీలు దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో పత్తి తీతకు రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లించినా, కూలీలు అందుబాటులో లేరు. అకాల వర్షాల వల్ల పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 5, 2025

‘అల్లూరి జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయాలి’

image

జిల్లాలో హోం పర్యాటకం విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు. బుధవారం పాడేరు ITDAలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, పీఎం జుగా పథకం కింద జిల్లాలో ఇప్పటికే 150 గృహాలకు హోంస్టే కోసం అనుమతులు లభించాయన్నారు. 40 లక్షల గడప ఉన్న జిల్లాలో 40 వేల హోంస్టేలు ఏర్పాటు చేసేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

News November 5, 2025

యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

image

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.