News March 11, 2025
గద్వాల: తల్లిదండ్రులు చనిపోయారు.. అనాథలుగా పిల్లలు

గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్లగార్లపాడు గ్రామంలో కొద్దిరోజుల క్రితం భారతి గుండెనొప్పితో మృతిచెందగా ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. గ్రామానికి చెందిన గడ్డమీది రాముడు తనవంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయం మంగళవారం అందజేశారు. పేదింటికి చెందిన ఆ పిల్లలను దాతలు ఆదుకోవాలని ఆయన కోరాడు.
Similar News
News September 17, 2025
కలెక్టర్కు కీర్తి చేకూరికి ఉద్యమ నోటీసులిచ్చిన సచివాలయ ఉద్యోగులు

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా ఐక్యవేదిక తరఫున జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందస్తు ఉద్యమ కార్యాచరణ నోటీసును అందజేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయలో ఐక్యవేదిక నాయకులు కలిసి ఈ వినతిని ఇచ్చారు. దడాల జగ్గారావు, కాశీ విశ్వనాథ్, రామాంజనేయులు, నాయుడు, కొల్లి రాజేష్, రామదాసు తదితరులు ఉన్నారు.
News September 17, 2025
నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).
News September 17, 2025
నిర్మల్: స్వచ్ఛతాహి సేవ పోస్టర్ల ఆవిష్కరణ

నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య స్వచ్ఛతాహి సేవ పోస్టర్లను ఈరోజు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు ఉన్నారు.