News March 11, 2025
NGKL: వట్టెం వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ వట్టెం వెంకన్న స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల సందడిలో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 30, 2025
నేర నియంత్రణలో జిల్లా పురోగతి సాధించింది: ఎస్పీ

మహిళల భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యం ఇచ్చి బాపట్ల జిల్లా పోలీస్ శాఖ నేర నియంత్రణలో గణనీయ పురోగతి సాధించిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో జిల్లాలో నమోదైన నేరాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం తగ్గాయన్నారు. వేగవంతమైన దర్యాప్తు, ముందస్తు చర్యలు, సీసీ కెమెరాల వినియోగం, రౌడీల కౌన్సిలింగ్ వల్ల నేరాల తీవ్రత తగ్గిందని వివరించారు.
News December 30, 2025
గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.
News December 30, 2025
వేములవాడ: ఉదయం 8 గంటల తర్వాతే కోడె మొక్కుల చెల్లింపు

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర క్షేత్రంలో మంగళవారం ఉదయం కోడె మొక్కుల చెల్లింపు నిలిపివేశారు. ఉత్తర ద్వారం శ్రీ స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఉదయం ఎనిమిది గంటల వరకు కోడె మొక్కుల టికెట్లను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.


