News March 11, 2025

కాంగ్రెస్ సోషల్ మీడియాకు RSP వార్నింగ్

image

కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన రాజకీయ భవిష్యత్తుపై గత 2 రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిల్లర వేషాలను కాంగ్రెస్ నేతలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.. ఏ వర్గాల భవిష్యత్తు కోసం పని చేయాలో క్లారిటీ ఉందన్నారు.

Similar News

News November 8, 2025

HYD: ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

image

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్, హెల్త్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆమోదిత ఫైర్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎ.విమలా రెడ్డి తెలిపారు. ఫైర్, ఇండస్ట్రీయల్, హెల్త్ సేఫ్టీ కోర్సుల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎన్విరాన్‌మెంట్ కోర్సులో మాస్టర్ డిప్లొమాలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: రేపు సాయంత్రం నుంచి ప్రచారం బంద్

image

జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది. EC నిబంధనల ప్రకారం సాయంత్రం తర్వాత మైకులు బంద్ చేయాలి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ కూడా మూతబడనున్నాయి. నవంబర్ 11న పోలింగ్ ఉండడంతో ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గెలుపు ఓటముల్లో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది.

News November 8, 2025

HYD: ముఖ్యమంత్రి ప్రజావాణిలో 285 దరఖాస్తులు

image

బేగంపేటలోని ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణిలో మొత్తం 285 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 154, రెవెన్యూకు 25, హోం శాఖకు 17, ఇందిరమ్మ ఇళ్ల కోసం 59, ప్రవాసి ప్రజావాణికి 1 దరఖాస్తు, ఇతర శాఖలకు సంబంధించి 29 దరఖాస్తులు అందినట్లు సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జ్ జీ.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌ వెల్లడించారు.