News March 11, 2025
పార్వతీపురం: వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల పేదలకు స్వయం ఉపాధి పథకాలు

జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News November 12, 2025
సిరిసిల్ల: లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి: ఇన్చార్జి కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలోని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.
News November 12, 2025
గురుకులాల బకాయిలు విడుదల చేయాలి: డిప్యూటీ సీఎం

ప్రజా భవన్లో గురుకులాల సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎస్సీ, మైనారిటీ గురుకులాల ₹163 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు మెనూను తప్పక పాటించాలని సూచించారు. ఆహార నాణ్యత, తనిఖీల విషయంలో రాజీ పడకూడదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
News November 12, 2025
ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.


