News March 11, 2025

అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయ్: రాజ్‌నాథ్ సింగ్

image

డీలిమిటిషన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయని, తమిళనాడులో కూడా పెరుగుతాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘నియోజకర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందనేది అపోహే. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెరుగుతాయి. దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం పునర్విభజన ప్రక్రియ జరుగుతుంది. దీనికి అందరి సలహాలు స్వీకరిస్తాం’ అని చెప్పారు.

Similar News

News March 16, 2026

పశ్చాత్తాపం అంటే ఇదేనేమో.. దొంగిలించిన నగలను తిరిగిచ్చాడు!

image

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ వింత ఘటన జరిగింది. ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దంపతుల బంగారు నగలను కాజేశాడో దొంగ. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అనుకున్నాడో ఏమో.. 20 రోజుల తర్వాత ఆ నగలను బాధితుల ఇంటికే కొరియర్‌లో పంపించాడు. ఇంటి ముందున్న పార్సిల్ చూసి షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వేలిముద్రల ఆధారంగా దొంగ ఎవరో తేల్చేపనిలో పోలీసులున్నారు.

News March 16, 2026

ఏ పార్టీలో చేరాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు: రాజాసింగ్

image

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను BJLP ఛాంబర్‌కి వెళ్లడంపై MLA రాజాసింగ్ స్పందించారు. ‘పాత ఇల్లు, పాత ఫ్రెండ్స్ కాబట్టి వెళ్లా. ఇంకా ఏ పార్టీలో చేరాలనేది డిసైడ్ అవ్వలేదు. ఎవరిని ఎవరు బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా BJLP ఛాంబర్ నుంచి వస్తున్న రాజాసింగ్‌ను చూసిన KTR ‘BJP నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి అక్కడికి ఎలా వెళ్లారు?’ అని సరదాగా ఆటపట్టించారు.

News March 16, 2026

నందిని సిధారెడ్డికి సాహిత్య అకాడమీ అవార్డు

image

TG: ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 24 భారతీయ భాషలలో ఈ సాహిత్య అవార్డులను అకాడమీ ప్రకటించింది. ‘అనిమేష’తో పాటు ఆయా భాషల్లోని రచయితల సాహిత్య పుస్తకాలకు అవార్డులను ప్రకటించింది. కొవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న వేదన, భయం, సంఘర్షణలను ప్రతిబింబించే కావ్యమిది. అప్పటి పరిస్థితులను అక్షరరూపంలో కళ్లకు కట్టేలా రచయిత ఆవిష్కరించారు.