News March 11, 2025
బయ్యారంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

బయ్యారంలో గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో తరలిస్తున్న ఈ గంజాయిని పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు, వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
2025: కడప జిల్లాలో పెరిగిన మృతుల సంఖ్య

కడప జిల్లాలో 2025 సంవత్సరంలో 699 ఘోర, సాధారణ రోడ్డు ప్రమాద కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 351 మంది మృతి. 781 మంది గాయపడ్డారు. 2024లో 633 రోడ్డు ప్రమాద కేసులు నమోదు కాగా.. 316 మంది మృతిచెందారు. 716 మంది గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఈ ఏడాది రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయని ఎస్పీ పేర్కొన్నారు.
News December 30, 2025
Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్బ్యాక్కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్ ఎక్స్లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్గా నిలబడ్డారు.
News December 30, 2025
అనకాపల్లి జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.. పెరిగిన సైబర్ క్రైమ్!

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 23% నేరాలు తగ్గాయని ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో 2025కి సంబంధించి క్రైమ్ రిపోర్ట్ను వివరించారు. మహిళలపై నేరాలు 387 నుండి 291కి, పొక్సో 44 నుండి 43, తీవ్రమైన నేరాలు 591 నుంచి 417కి తగ్గాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 54% తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ 25% పెరిగిందన్నారు. 1,880సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు.


