News March 11, 2025
ఉప్పలగుప్తం: పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం ప్రధాన పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సుమారు 52 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష మృతదేహం గత మూడు రోజుల నుంచి కాలువలో కనిపిస్తున్నా రెవెన్యూ అధికారులు, పోలీసు ఇంతవరకు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం వ్యక్తి మృతిచెంది ఉండవచ్చునని, దుర్వాసన వస్తుందని పోలీసులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 17, 2025
నిజాం హింసలకు సాక్ష్యం రాయికల్ ఠాణా

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్లో ఉన్న పాత పోలీస్ ఠాణా, నిజాం కాలంలో జరిగిన హింసలకు నిలువెత్తు సాక్ష్యం. దొరలు, రజాకార్ల చిత్రహింసలకు ఈ భవనం వేదికగా నిలిచింది. ఇనుప చువ్వల గదులు, ఇనుప మంచాలతో రూపొందించిన ఈ బందీఖానాలో పోరాట యోధులను చిత్రవధ చేశారు. ఈ భవనంపై ప్రజలు అనేకసార్లు దాడులు చేసి నిజాంను ఎదిరించారు. నేటికీ చెక్కుచెదరకుండా ఉన్న ఈ భవనం నాటి చరిత్రకు గుర్తుగా నిలుస్తోంది.
News September 17, 2025
రజాకార్లపై రాములపల్లి ప్రజల పోరాటం

తెలంగాణ విమోచన పోరాటంలో భాగంగా 1947లో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి, ఎలబోతారం గ్రామాల ప్రజలు రజాకార్లపై తిరుగుబాటు చేశారు. భూలక్ష్మి అమ్మవారి గద్దె వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ప్రాణాలైనా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆగస్టు 12న హుజురాబాద్ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు అమరులయ్యారు. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒడిసెలు, రాళ్లతో దాడి చేసి ఒక పోలీసు అధికారిని హతమార్చారు.
News September 17, 2025
HYD: ఏడీఈ ఇంట్లో నేడు కొనసాగనున్న సోదాలు

ఏడీఈ అంబేడ్కర్ నివాసంలో కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేర్లతో ఉన్న ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.300 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు. కాగా, HYDతో పాటు నల్లగొండ, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో కొనసాగిన సోదాల్లో పట్టుబడిన ఆస్తుల వివరాలు ACB అధికారులు వెల్లడించలేదు. సోదాలు నేడూ కొనసాగనున్నాయి.