News March 11, 2025
ఉల్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు ఈనెల 23వ తేదీన నిర్వహించే పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వయోజన విద్యా, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఉల్లాస్ శిక్షణ పూర్తిచేసిన 7,321 మంది పరీక్షకు హాజరవుతారన్నారు.
Similar News
News September 18, 2025
సిరిసిల్ల: ‘సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి’

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పి. గీతే సైబర్ వారియర్లకు సూచించారు. సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సైబర్ వారియర్లకు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మరింత నైపుణ్యంతో సైబర్ నేరాలను ఛేదించాలని ఆయన వారియర్లను కోరారు.
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.
News September 18, 2025
పనులు నాణ్యతతో చేపట్టండి: కలెక్టర్

పాణ్యం నుంచి గోరుకల్లు రిజర్వాయర్ వరకు రూ.6.29 కోట్లతో నిర్మించిన రహదారి పనులను కలెక్టర్ జి.రాజకుమారి గురువారం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్లు, ఎస్.కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.