News March 11, 2025
సంగారెడ్డి: ఈనెల 15న తల్లిదండ్రుల సమావేశం: డీఈవో

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 15న తల్లిదండ్రుల (పీటీఎం) సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల హాజరు, పదో తరగతి పరీక్షలపై చర్చించాలని, ఈ సమావేశానికి సంబంధించిన నివేదికలను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు.
Similar News
News January 5, 2026
అవయవదానం ఫ్యామిలీకి రూ.లక్ష!

AP: అవయవదానం చేసిన జీవన్మృతుల కుటుంబాలకు రూ.లక్ష అందజేయాలని సీఎంకు మంత్రి సత్యకుమార్ ప్రతిపాదనలు పంపారు. దీంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక బలం చేకూరడంతో పాటు అవయవదానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అలాగే ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది 93మంది జీవన్మృతుల నుంచి అవయవాలు తీసుకొని 301 మందికి అమర్చినట్లు మంత్రి చెప్పారు.
News January 5, 2026
మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.
News January 5, 2026
అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్

అనంతపురం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో నిన్న టీడీపీలో చేరారు. ముందుగా వేలాది మంది అనుచరులతో నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియాజ్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా వైసీపీ జెండా మోసినా తనకు గుర్తింపు దక్కలేదన్నారు.


