News March 11, 2025

SKLM: జిల్లా అభివృద్ధి లక్ష్యాలను పూర్తి చేయాలి

image

ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో రెవెన్యూ, గ్రామ సచివాలయం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై చర్చించారు.

Similar News

News March 29, 2026

SKLM: మీ సమస్యలను కలెక్టర్‌కు తెలపండి

image

శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10- 2గంటల వరకు ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు నేరుగా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చునన్నారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని తెలియజేశారు. అనంతరం 1100 నంబర్‌కు అర్జీదారులు ఫోన్ చేసి ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

News March 29, 2026

నరసన్నపేట: సైబర్ మోసం.. బ్యాంకు ఖాతా ఖాళీ

image

సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న యువకుడు ఖాతాలో డబ్బులు మాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నరసన్నపేట మండలం కోమార్తి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రిందట వాట్సాప్ లో వచ్చిన లింకుని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో ఉన్న రూ.52,000 మాయం అయ్యాయని తెలిపాడు. పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ తెలిపారు.

News March 29, 2026

శ్రీకాకుళం: చికెన్ రూ.400.. గుడ్లు రూ.150

image

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఒక్కసారి పెరిగింది. రూ. 400 స్కిన్లెస్ ధర ఉంది. కొన్ని ప్రాంతాల్లో రూ. 350కు సైతం అంటున్నారు. లైవ్ రూ. 210కి అమ్ముతున్నారు. కోడిగుడ్ల ధర మాత్రం స్థిరంగా ఉంది. 30 గుడ్లు రూ.150కి అమ్ముతున్నారు. చికెన్ ధర ఒకసారి పెరగటంతో సామాన్యులకు ఆర్థిక భారంగా ఉంది. వేసవిలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.