News March 11, 2025
నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Similar News
News April 16, 2026
సిరిసిల్ల: పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం: ఎస్పీ

ఎండల తీవ్రత దృష్ట్యా విధుల్లో ఉన్న పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి ఆయన కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. భానుడి భగభగలకు సిబ్బంది ఇబ్బంది పడకూడదని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 16, 2026
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్కు చెందిన లోన్ అకౌంట్లను బ్యాంకులు ఫ్రాడ్గా పేర్కొని దర్యాప్తు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అనిల్ అంబానీ వేసిన పిటిషన్ను SC కొట్టివేసింది. ఈ దశలో స్టే విధించలేమని ధర్మాసనం పేర్కొంది. తొలుత బాంబే HC సింగిల్ బెంచ్ అంబానీకి ఫేవర్గా తీర్పునిచ్చింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, IDBI పిటిషన్ను విచారించిన డివిజన్ బెంచ్ దీనిని పక్కన పెట్టింది.
News April 16, 2026
NZB: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు: DCC అధ్యక్షుడు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పసుపు రైతులకు ఇబ్బందులు అని కాంగ్రెస్ NZB జిల్లా అధ్యక్షుడు నగేశ్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పసుపు కొనుగోళ్ల కోసం కొత్తగా తెచ్చిన 0.2 సాఫ్ట్వేర్లో NZB మార్కెట్ను చేర్చకపోవడం బీజేపీ కుట్రని, దీని వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.


