News March 11, 2025
సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

TG: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో <<15712556>>తెలంగాణ<<>> ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని AP CM చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 12, 2025
ఫేక్ ఎంప్లాయీస్తో ₹18కోట్లు కొట్టేసిన HRమేనేజర్

షాంఘైలో లేబర్ సర్వీసెస్ కంపెనీ పేరోల్ HR మేనేజర్ యాంగ్ ఘరానా మోసం ఉలిక్కిపడేలా చేస్తోంది. 22 ఫేక్ ఎంప్లాయీస్ పేరుతో 8 ఏళ్లలో అతడు ₹18కోట్లు కొట్టేశాడు. ఉద్యోగుల నియామకం, శాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడాన్ని గమనించిన అతడు మొదట సన్ పేరుతో ఫేక్ A/C సృష్టించాడు. కంపెనీ జీతం వేయడంతో మిగతా కథ నడిపించాడు. ఒక్క రోజైనా సెలవు పెట్టకుండా జీతం తీసుకుంటున్న సన్ గురించి ఫైనాన్స్ శాఖ ఆరా తీయడంతో మోసం బయటపడింది.
News March 12, 2025
PhonePe చూసి మీరూ షాక్ అయ్యారా?

దేశంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యూపీఐ యాప్ ‘ఫోన్పే’ అప్డేట్ అయింది. ఇప్పటి వరకూ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ‘ఫోన్ పే’ యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. మీ కామెంట్?
News March 12, 2025
2027 WC వరకూ రోహిత్ ఆడాలి: పాంటింగ్

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2027 ODI WC వరకూ ఆడాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఆకాంక్షించారు. హిట్ మ్యాన్ భారత్కు మరో WC అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘తాను ఇప్పుడే వన్డేలకు రిటైర్ కానని, భారత్కు నాయకత్వం వహించడం ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన మాటలు చూస్తోంటే వచ్చే ODI WC అందించాలనే కసి కనిపిస్తోంది. ఆయన మనసులో అదే ఉందని భావిస్తున్నా’ అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చారు.