News March 11, 2025
BNG: దారుణం.. 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News March 1, 2026
కలలో చీపురు కనిపిస్తే..

కలలు సాధారణం. అయితే అందులో చాలా వస్తువులు కనిపిస్తాయి. వాటిపై అనేక అపోహలుంటాయి. అందులో చీపురు ఒకటి. అది కనిపిస్తే అశుభమని భయపడతారు చాలామంది. కానీ అది పొరపాటని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ‘చీపురు లక్ష్మీదేవి స్వరూపం. కలలో చీపురు కనిపిస్తే దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఇది జీవితంలో రాబోయే సానుకూల మార్పులకు సూచిక. ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News March 1, 2026
ఇరాన్ అగ్రనాయకత్వాన్ని హతం చేశాం: ఇజ్రాయెల్

అమెరికాతో కలిసి జరిపిన దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్లు ట్రంప్, నెతన్యాహు వెల్లడించారు. రక్షణ మంత్రి అజీజ్, సుప్రీం లీడర్ మిలిటరీ బ్యూరో చీఫ్ షిరాజీ, డిఫెన్స్ కౌన్సిల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలీ షంఖానీ, IRGC చీఫ్ మహమ్మద్ పక్పౌర్, SPND ఛైర్మన్ హోస్సేన్ జబల్, SPND మాజీ ఛైర్మన్ మొజాఫరీ, అలన్బే కమాండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సలేహ్ అసాదీ హతమయ్యారు.
News March 1, 2026
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

బాపట్ల (D) అద్దంకి మధురా నగర్ నామ్ (NAM) రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బైక్ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొనడంతో కొంగపాడుకి చెందిన యేసుపోగు వినోద్(32), ఏజర్ల చిన్న(25) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


