News March 11, 2025

BNG: దారుణం.. 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 12, 2025

రాజమండ్రి: 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’

image

స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి ‘అందరికీ ఇల్లు’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 27,441 మందికి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. అలాగే అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం కింద ఎస్సీ, బిసీలకు రూ.50,000/- & ఎస్టీలకు రూ.75,000 అందజేయనున్నట్లు వెల్లడించారు.

News March 12, 2025

ఫేక్ ఎంప్లాయీస్‌తో ₹18కోట్లు కొట్టేసిన HRమేనేజర్

image

షాంఘైలో లేబర్ సర్వీసెస్ కంపెనీ పేరోల్ HR మేనేజర్ యాంగ్ ఘరానా మోసం ఉలిక్కిపడేలా చేస్తోంది. 22 ఫేక్ ఎంప్లాయీస్‌ పేరుతో 8 ఏళ్లలో అతడు ₹18కోట్లు కొట్టేశాడు. ఉద్యోగుల నియామకం, శాలరీ రివ్యూ ప్రాసెస్ లేకపోవడాన్ని గమనించిన అతడు మొదట సన్ పేరుతో ఫేక్ A/C సృష్టించాడు. కంపెనీ జీతం వేయడంతో మిగతా కథ నడిపించాడు. ఒక్క రోజైనా సెలవు పెట్టకుండా జీతం తీసుకుంటున్న సన్ గురించి ఫైనాన్స్ శాఖ ఆరా తీయడంతో మోసం బయటపడింది.

News March 12, 2025

PhonePe చూసి మీరూ షాక్ అయ్యారా?

image

దేశంలోనే అత్యధిక యూజర్లు కలిగిన యూపీఐ యాప్ ‘ఫోన్‌పే’ అప్డేట్ అయింది. ఇప్పటి వరకూ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న యాప్‌లో జరిగిన మార్పులు చూసి కస్టమర్లు షాక్ అవుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్ స్కాన్ చేయడం మినహా అందులో ఏ ఆప్షన్ అర్థం కావట్లేదని, ఇలా ఎందుకు అప్డేట్ చేశారని మండిపడుతున్నారు. ఇక సీనియర్ సిటిజన్లు ఇది ‘ఫోన్ పే’ యాప్ కాదంటూ ఆందోళన చెందుతున్నామని అంటున్నారు. మీ కామెంట్?

error: Content is protected !!