News March 12, 2025

ఎంగేజ్మెంట్ రింగ్‌ను సమంత ఏం చేశారంటే?

image

హీరోయిన్ సమంత తన నిశ్చితార్థపు ఉంగరపు డైమండ్‌ను లాకెట్‌గా మార్చుకున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. విడాకుల అనంతరం ఎంగేజ్మెంట్ రింగ్స్‌ను సరికొత్తగా మార్చుకోవడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారిపోయిందని తెలిపాయి. లైఫ్‌లో ముందుకు సాగేందుకు ప్రముఖులు ఇదొక మార్గంగా ఎంచుకుంటున్నట్లు వెల్లడించాయి. తన వివాహ గౌన్‌ను కూడా బోల్డ్ బ్లాక్ బాడీకాన్‌గా మార్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News March 12, 2025

దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

image

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.

News March 12, 2025

మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

image

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.

News March 12, 2025

తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: సీఎం

image

AP: ‘తల్లికి వందనం’ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.

error: Content is protected !!