News March 12, 2025
ADB: LRS పై 25% రాయితీ: కలెక్టర్

ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మార్చి 31లోపు చెల్లించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్ అందజేశారు. 25% రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన సదవాకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.
Similar News
News November 6, 2025
ADB: ఈ రెండో శనివారం సెలవు రద్దు

ఈ నెల 8న రెండో శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 28న అత్యధిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ శనివారం విద్యా సంస్థల సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.
News November 5, 2025
సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది పటిష్టమైన సమాచార వ్యవస్థను సొంతంగా నిర్మించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పోలీస్ హెడ్ కోటర్స్ సమావేశ మందిరంలో జిల్లాలోని బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందితో సమావేశం నిర్వహించారు. నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఉండాలని, డయల్ 100 సేవలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాత్రుళ్లు గస్తీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.
News November 5, 2025
ఉట్నూర్: ఈ నెల 11న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపఃల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ 50% మార్కులతో, 26 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డులతో కళాశాలలో హాజరు కావాలన్నారు. వివరాలకు 9885762227, 9321825562ను సంప్రదించాలాన్నారు


