News March 12, 2025

స్టేషన్ ఘనపూర్:  సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

image

ఈనెల 16న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రెండు రోజుల ముందే ఏర్పాటు పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆర్డీవో డీఎస్ వెంకన్నతో కలిసి బహిరంగ సభ స్థలాన్ని, హెలిపాడ్ స్థలాన్ని, పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 18, 2026

JN: వల్మీడి బ్రహ్మోత్సవాలు.. సమన్వయంగా పనిచేయాలి: కలెక్టర్

image

పాలకుర్తి మండలం వల్మిడిలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం సమీక్ష నిర్వహించారు. డీసీపీ, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టరేట్‌లో చర్చించారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News March 18, 2026

జనగామ: పది పరీక్షలకు 99.95 శాతం హాజరు

image

జనగామ జిల్లాలోని 39 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 99.95 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. మొత్తం 6430 మంది విద్యార్థులకు గాను 6427 మంది హాజరయ్యారని, ముగ్గురు గైర్హాజరయ్యారని తెలిపారు. రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.

News March 18, 2026

BHPL: డిప్యూటీ తహశీల్దార్‌లకు పదోన్నతులు

image

రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ఏ అధికారి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నలుగురు తహశీల్దార్లు నియమితులయ్యారు. ములుగు నుంచి రాపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ నుంచి టి.వసంత్ రావు, టి.స్వరూప రాణి, వరంగల్ నుంచి అడ్లూరి రాజేశ్వర్ రావులకు భూపాలపల్లి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లో చేరనున్నారు.