News March 12, 2025
ప్రపంచమంతా ఏకమైనా టీమ్ ఇండియాను ఓడించలేరు: అఫ్రీది

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీమ్ను ఓడించలేరని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులే. భారత్కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

పశ్చిమ బెంగాల్లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.
News March 12, 2025
మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న <<15732112>>ఆరోపణలన్నీ<<>> అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం. క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.
News March 12, 2025
తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: సీఎం

AP: ‘తల్లికి వందనం’ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. పథకం అమలుకు ఎలాంటి నిబంధనలు లేవని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15వేల చొప్పున అందిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. గతంలో జనాభాను నియంత్రించాలని చెప్పిన తానే ఇప్పుడు పెంచాలని కోరుతున్నానని గుర్తుచేశారు. ఎన్ని కాన్పులైనా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు.