News March 12, 2025

జైపూర్: 40 నెలల్లో పవర్ ప్లాంట్ పూర్తి: సింగరేణి సీఎండీ

image

జైపూర్‌లోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలో నూతనంగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 4ఏళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలని పేర్కొన్నారు. కానీ 40 నెలల్లోనే పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.

Similar News

News October 30, 2025

BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 30, 2025

BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 30, 2025

MHBD- తొర్రూర్ రహదారిపై కూలిన చెట్టు

image

తుఫాను బీభత్సానికి శనిగపురం వద్ద మహబూబాబాద్ – తొర్రూరు ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోయింది. దీని కారణంగా వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబాబాద్ – చిన్నగూడూరు రహదారిపై కూడా చెట్లు విరిగిపడటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.