News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఆసిఫాబాద్కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. పెండింగ్లో ఉన్న అంబేడ్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఆడా, వట్టివాగు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి నిధుల కేటయించాలని కోరుతున్నారు.
Similar News
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.
News November 2, 2025
జానపద కళాకారుల సంక్షేమంపై కవిత హామీ

జానపద కళాకారుల సంక్షేమంపై కరీంనగర్లో జరిగిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. జానపద సంప్రదాయాన్ని నిలబెట్టిన కళాకారులకు కళాభివందనం చేసిన కవిత, హక్కుల కోసం అందరూ కలిసి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.


