News March 12, 2025

రోడ్డు ప్రమాదంలో మండపేట యువకుడు మృతి

image

మహరాష్ట్రలో పనికోసం వెళ్లిన మండపేట యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలు.. నగరంలోని కొండపల్లివారి వీధికి చెందిన జితేంద్ర(33) ఉద్గార్‌లోని ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈనెల 7న బైక్‌పై మహరాష్ట్రలోని హల్నీ రోడ్డుపై వెళ్తుండగా ఓ గూడ్స్‌వ్యాన్ ఢీకొట్టింది. గాయపడిన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News September 17, 2025

నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

image

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి: KMR కలెక్టర్

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి చుక్కాపూర్, మాచారెడ్డి మీదుగా బండ రామేశ్వరంపల్లి వరకు ఉన్న రోడ్డు మరమ్మతులను ఆయన సమీక్షించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆయన ఆదేశించారు.

News September 17, 2025

భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి

image

కుప్పం (M) బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.