News March 12, 2025

గజ్వేల్: KCRని కలిసిన దాసోజు శ్రవణ్ 

image

ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నామినేషన్ అనంతరం స్క్రూటినీ పూర్తిచేసుకున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.

Similar News

News January 31, 2026

రీప్లేస్‌మెంట్‌కు రెడీ.. పాక్ స్థానంలో ఆడతామన్న ఉగాండా

image

T20 WCలో ఆడటంపై పాక్ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాలు పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే దాని స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరిన <<18982902>>ఐస్‌లాండ్<<>>.. ఆ వెంటనే అందుబాటులో ఉండలేమని సెటైరికల్‌ పోస్ట్ చేసింది. ఇది ఉగాండాకు కలిసొస్తుందని పేర్కొంది. దీంతో నేడు ఉగాండా కూడా అవకాశం ఉంటే ఆడేందుకు తాము సిద్ధమని.. బ్యాగ్‌లు రెడీ చేసుకున్నామని ఫన్నీగా పోస్ట్ పెట్టింది.

News January 31, 2026

మేడారం జాతరలో చేతివాటం..!

image

తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు ఎవరి పనుల్లో వారుంటే సందట్లో సడేమియాలాగా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మేడారం జాతర తొలిరోజే 40 తులాల బంగారం చోరీ జరగగా, జాతర మొత్తం కలిపి 150 తులాల బంగారం చోరికి గురయ్యింది. చోరీలకు పాల్పడిన ముగ్గురు మహిళా దొంగలతో పాటు ఆరుగురు ఒరిస్సా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News January 31, 2026

జంతు కొవ్వు కలిసిందని కేంద్ర సంస్థే చెప్పింది: లోకేశ్

image

AP: దేవుడి లడ్డూపై వైసీపీ డ్రామా మొదలుపెట్టిందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘2024లో చంద్రబాబు సీఎం కాగానే నెయ్యి శాంపిల్స్ తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ఆధ్వర్యంలోని సంస్థ ద్వారా టెస్ట్ చేయగా జంతు కొవ్వు కలిసిందని, వెజిటబుల్ ఆయిల్ ఉందని తేలింది. మొన్నటి ఛార్జ్‌షీట్ పేజీ నెం.35లో సీబీఐ చాలా స్పష్టంగా చెప్పింది’ అని కాకినాడలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు.