News March 23, 2024
ధోనీ కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు: గేల్
ఆర్సీబీతో మ్యాచ్లో చురుగ్గా కనిపించిన ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చని మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ తెలిపారు. ‘ఈ సీజన్లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్లు ఆడరు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు. దీని గురించి చింతించకండి’ అని గేల్ తెలిపారు.
Similar News
News October 2, 2024
నా డివోర్స్ వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.
News October 2, 2024
‘ఆగడు’కి ముందు అనుకున్న కథ అది కాదు: శ్రీను వైట్ల
మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో దూకుడు వంటి హిట్ తర్వాత వచ్చిన ‘ఆగడు’ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అయితే తాను వాస్తవంగా ఆ సినిమాకు అనుకున్న కథ వేరే అని శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆగడుకి ముందు మహేశ్కు వేరే స్టోరీ అనుకున్నాం. మహేశ్కూ నచ్చింది. కానీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా పల్లెటూరిలో జరిగే సింపుల్ కథను ఎంచుకుని సినిమాగా తీశాం. నేను ఇప్పటికీ బాధపడే నిర్ణయం అది’ అని తెలిపారు.
News October 2, 2024
గోవిందా వివరణపై పోలీసుల అసంతృప్తి!
అనుకోకుండా తుపాకీతో <<14239558>>కాల్చుకోవడంపై<<>> బాలీవుడ్ నటుడు, శివసేన నేత గోవిందాను ముంబై పోలీసులు ప్రశ్నించారు. రివాల్వర్ను శుభ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా మిస్ ఫైర్ అయిందని ఆయన చెప్పగా ఆ వివరణతో పోలీసులు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. పలు అనుమానాలు రావడంతో ఆయన కుమార్తెను సైతం విచారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.