News March 23, 2024
ధోనీ కొన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు: గేల్

ఆర్సీబీతో మ్యాచ్లో చురుగ్గా కనిపించిన ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్లో అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చని మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ తెలిపారు. ‘ఈ సీజన్లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్లు ఆడరు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు. దీని గురించి చింతించకండి’ అని గేల్ తెలిపారు.
Similar News
News January 23, 2026
వృద్ధాప్యానికి చెక్ పెట్టొచ్చు: ఎలాన్ మస్క్

మరణాన్ని, వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. వయసుని తగ్గించడం కూడా సాధ్యమేనని అన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఆయన మాట్లాడారు. శరీరంలోని అన్ని భాగాలు ఒకేసారి ముసలితనం వైపు వెళ్తున్నాయంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుందన్నారు. అయితే మనిషి ఎక్కువ కాలం జీవిస్తే క్రియేటివిటీ తగ్గి సమాజంలో వచ్చే మార్పులు ఆగిపోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
News January 23, 2026
INDvsNZ 4వ T20.. టికెట్లు విడుదల

భారత్-న్యూజిలాండ్ మధ్య 28వ తేదీన జరగనున్న 4వ T20కి టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ విశాఖలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో బుధవారం రాత్రి 7గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు district యాప్లో అందుబాటులో ఉన్నాయి.
News January 23, 2026
‘MSVPG’కి పెంచిన టికెట్ ధరల లెక్కలు ఇవ్వండి: HC

TG: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి వాస్తవ లెక్కలను సమర్పించాలని GST అధికారులను హైకోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధంగా టికెట్ ధరలను పెంచారని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రూ.45 కోట్లు అక్రమంగా సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని పిటిషనర్ శ్రీనివాస రెడ్డి కోరారు. కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.


