News March 12, 2025
ఏలూరు: ప్రేమించి నమ్మించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఆన్లైన్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఏలూరు రూరల్ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడిగితే తక్కువ కులానికి చెందిన దానివని అవమానంగా దూషించడాని పోలీసులకు తెలిపింది. యువతి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. రాజమండ్రికి చెందిన శివగిరి సందీప్ ఆన్లైన్లో పరిచయమై ఆమెను మోసం చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 13, 2026
షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

హండ్రెడ్ లీగ్ సన్రైజర్స్లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.
News March 13, 2026
అందుబాటులో గ్యాస్ సిలిండర్లు: మంత్రి ఉత్తమ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు.
News March 13, 2026
HNK: ఇంటి బాట పట్టిన ఇంటర్ విద్యార్థులు!

ఇంటర్ వార్షిక పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. హాస్టల్లో చదివిన విద్యార్థులు తమ ఇళ్లకు చేరుకోవడానికి హనుమకొండ బస్టాండ్కు వచ్చారు. జిల్లా కేంద్రం నుంచి ములుగు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, కరీంనగర్, జమ్మికుంట తదితర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులతో బస్టాండు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ మేరకు ఆయా పాయింట్ల వద్ద బస్సులు అందుబాటులో ఉంచారు.


