News March 12, 2025
గాజువాక: ఎలక్ట్రికల్ పోల్ పడి ఒకరు మృతి

గాజువాక సమీపంలో గల నాతయ్యపాలెం డైరీ వద్ద మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎలక్ట్రికల్ పోల్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో కే.కోటపాడుకు చెందిన బొత్స కామేశ్వరరావు(37) తీవ్ర గాయాలవ్వగా స్థానికుల వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడ్డ మరో మహిళ దొడ్డి సత్యవతి చికిత్స పొందుతోంది. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 6, 2026
విశాఖ నగరంలో నీటి సరఫరా ఎంతంటే..?

నగరంలో నీటి వినియోగం లభ్యత విషయాలపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. 24 లక్షల జనాభాకు గత ఏడాది నుంచి 453MLD అవసరం కాగా 390MLD సరఫరా జరుగుతుందని, భవిష్యత్తులో వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని తెలిపారు. రీసైక్లింగ్ పద్ధతిలో నీటిని వాడుకునే విధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.
News March 6, 2026
మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలి: డీఈవో

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మార్చి 10 లోపు TIS డేటాను డిక్లరేషన్ అందించాలని డీఈవో ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. 10వ తేదీ తరువాత డిక్లరేషన్ ఫారంలు స్వీకరించరన్నారు.


