News March 12, 2025
ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల మూల్యాంకనం నగరంలోని నయాబజార్ జూనియర్ కళాశాలలో చురుగ్గా సాగుతోంది.మొదటి రోజు మొత్తం 24 మంది అధ్యాపకులకు 15 మంది హాజరై ఒక్కొక్కరు 30 పేపర్ల చొప్పున 450 సంస్కృతం సంస్కృతం మూల్యాంకనం నిర్వహించారు. మంగళవారం 24 మంది అధ్యాపకులకు 19 మంది హాజరై ఒక్కొ క్కరు 30 పేపర్ల చొప్పున 570 పేపర్లను మూల్యాంకనం చేయగా మొత్తం 1,020 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు.
Similar News
News January 10, 2026
KMM: ఎస్సీ స్టడీ సర్కిల్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మం ఎస్సీ స్టడీసర్కిల్ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఐదు నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 20 నుంచి తరగతులు ప్రారంభిస్తామని.. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 10, 2026
ఖమ్మం: 12న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపిక

ఆదిలాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఖమ్మం జిల్లా జట్ల ఎంపికను ఈ నెల 12న నిర్వహించనున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సబ్ జూనియర్ విభాగాల్లో క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొని జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఆయన కోరారు.
News January 10, 2026
KMM: చిరుత దహనంపై ‘నిశ్శబ్ద’ దర్యాప్తు.. నిందితులెవరు?

ఖమ్మం జిల్లా పులి గుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం దహనం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అసలు ఏడాది కాలంగా ఈ విషయాన్ని ఎందుకు దాచారు? చిరుత గోళ్లు, చర్మం ఏమయ్యాయి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. అటవీశాఖలో అధికారుల మార్పులు జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


