News March 12, 2025

అనకాపల్లి: ’15లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

image

మహాత్మ జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మరో మూడు రోజుల్లో గడువు మునియనుంది. ఈనెల 15 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయాల కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఇంటర్, 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 12, 2025

ఉద్యోగులకు ₹33కోట్ల షేర్లు గిఫ్ట్‌గా ఇస్తున్న ప్రమోటర్

image

ఉద్యోగులకు తన షేర్లలో కొన్ని గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా‌కు సెబీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఆరంభించి 25ఏళ్లు కావడంతో కొన్నేళ్లుగా నిజాయతీగా సేవలందిస్తున్న 650 మందికి ₹33కోట్ల విలువైన 1,75,000 షేర్లను పంచాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందుకు ఒక చిన్న నిబంధన అడ్డంకిగా మారడంతో సెబీని సంప్రదించారు. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.1900గా ఉంది. మీ కామెంట్.

News March 12, 2025

ఫిర్యాదుదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దరఖాస్తు చేసిన అర్జీదారుల నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చే ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

News March 12, 2025

అల్లూరి: ఆటో- బైక్ ప్రమాదం.. ఒకరు మృతి

image

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం మారేల వద్ద బుధవారం సాయంత్రం బైక్-ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. పెదబయలు మండలం మొండికోటకు చెందిన పల్లిపోయిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పాడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అతివేగంగా బైక్ నడిపి ఆటోను ఢీకొట్టడం వలన ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

error: Content is protected !!