News March 12, 2025
కోన శశిధర్కు తిరుపతి జిల్లా బాధ్యతలు

తిరుపతి జిల్లా ప్రత్యేకాధికారిగా కోన శశిధర్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.
Similar News
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.
News March 22, 2026
వివాదంలో జనగామ కలెక్టర్!

జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కానే లేదు వివాదాలు ఎదుర్కొంటున్నారు. వచ్చీరాగానే ప్రజావాణిలో ఓ వృద్ధుడి ధీనస్థితిని చూసి వైద్యం చేయించి ఆరంభంలో శభాష్ అనిపించుకున్నారు. కానీ కలెక్టరేట్ ఎదుట ఉన్న టీ, విజయ డెయిరీ స్టాళ్లను తొలగించాలన్న నిర్ణయం వివాదాస్పదమైంది. తాజాగా జనగణన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ ఎంపికైనట్లు మెసేజ్లు పంపించి కొందరినే పరీక్ష అనుమతించడం గమనార్హం.
News March 22, 2026
మంచిర్యాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

పదేళ్ల క్రితం ఆ కుటుంబాన్ని లారీ ప్రమాదం కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంటి పెద్దను బలిగొన్న అదే మృత్యువు, కొడుకును కూడా అదే రూపంలో కబళించడం స్థానికులను కన్నీటిపర్యంతం చేసింది. జైపూర్ మం. టేకుమట్ల వంతెన వద్ద శనివారం <<19443353>>సాయంత్రం<<>> జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రామగుండానికి చెందిన పోరడ్ల సాయికుమార్(23) దుర్మరణం చెందాడు. రంజాన్ వేడుకలకు హాజరై వెళ్తుండగా లారీ అతివేగంగా వచ్చి సాయికుమార్ను పొట్టన పెట్టుకుంది.


