News March 12, 2025
సంగారెడ్డి: 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదివే 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Similar News
News March 21, 2026
భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.
News March 21, 2026
నిర్మల్: పర్యావరణానికి అటవీ సంపద ఊపిరి

ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో 1,778.26 చ.కి.మీ అడవి ఉండగా, మంచిర్యాల 1,564.93, ఆదిలాబాద్ 1,145.76, నిర్మల్లో 1,085.02 చ.కి.మీ విస్తరించి ఉంది. ఈ అటవీ సంపద ప్రాంతీయ జీవవైవిధ్యానికి, వర్షపాత సమతుల్యతకు దోహదపడుతోంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ అడవులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
News March 21, 2026
పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్పేట్లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


