News March 23, 2024
టెన్త్ క్లాస్ అమ్మాయిలకు గంజాయి.. సంచలన విషయాలు

TS: జగిత్యాలలో టెన్త్ క్లాస్ అమ్మాయిలు <<12905092>>గంజాయికి<<>> బానిసలైన కేసులో ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. జగిత్యాల గంజాయికి విశాఖతో లింక్ ఉందని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని, వీరు చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి జగిత్యాలలో చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
నష్టాలతో మొదలై.. భారీ లాభాల్లో మార్కెట్లు

ఇండియన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ కాసేపటి క్రితం 1074 పాయింట్ల లాభంతో 78,126 వద్ద ట్రేడ్ అవుతోంది. Nifty 300 పాయింట్ల లాభంతో 23,737 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతీ ఎయిర్టెల్, ఐసీసీఐ బ్యాంక్, గ్రాసిం ఇండస్ట్రీస్, సన్ ఫార్మా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. విప్రో, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, L&T, HCL టెక్నాలజీస్ నష్టాల్లో ఉన్నాయి.
News April 17, 2025
సరిలేరు నీకెవ్వరు.. చిన్నారుల ఆపరేషన్కు మహేశ్ సాయం

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేశ్బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురు పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ‘MB ఫౌండేషన్’ ట్వీట్ చేసింది. వరలక్ష్మి (2 నెలలు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెలలు), పూజ్యశ్రీ ఫనీక్ష (8 నెలలు)లకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా, ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500+ సర్జరీలు జరగడం విశేషం.
News April 17, 2025
సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరు

AP: మద్యం కుంభకోణం కేసులో ఇవాళ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని సిట్కు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు విచారణకు హాజరయ్యేది త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.