News March 12, 2025
భైంసా: విద్యుత్ షాక్తో రైతు మృతి

భైంసా మండలం కోతుల్గాం గ్రామానికి చెందిన రైతు పాలబోయిన భోజన్న(62) మంగళవారం కరెంట్ షాక్తో మరణించినట్లు భైంసా గ్రామీణ సీఐ నైలు తెలిపారు. మొక్కజొన్న పంటకు నీరందించేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు పంటకు జంతువుల బారి నుంచి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
Similar News
News September 15, 2025
BHPL: కొడుకు చనిపోయినా కళ్లు బతకాలనుకున్నారు!

కొడుకు చనిపోయి పుట్టెడు శోఖంలో ఉన్నా అతడి కళ్లు బతకాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. HYD ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకోవడమే కాదు.. వేల మందికి ఆదర్శంగా నిలిచారు ఆ దంపతులు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గోవర్ధన్ కుమారుడు శ్రవణ్ గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. దీంతో కొడుకు నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు.
News September 15, 2025
రాజమండ్రి: సెప్టెంబర్ 17 నుంచి ఉచిత వైద్య సేవలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన ప్రచార గోడ ప్రతులను రాజమండ్రిలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి ఆవిష్కరించారు. జిల్లాలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శిబిరాల ద్వారా మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.
News September 15, 2025
‘మిరాయ్’లో శ్రియ పాత్రపై ప్రశంసల వర్షం

సెకండ్ ఇన్నింగ్సులో శ్రియ సినిమాల్లో నటించే పాత్రల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘మిరాయ్’లో ఆమె పోషించిన అంబిక పాత్ర ఆ కోవలోకే వస్తుంది. మూవీలో ఆమె ప్రజెన్స్ అదిరిపోయిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తన నటనతో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లారని, తెరపై ఆమె కనిపించిన ప్రతిసారి ఓ ఎమోషన్ క్యారీ చేశారని అంటున్నారు. సినిమాకు కీలకమైన పాత్రలో ఆమెను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని కొనియాడుతున్నారు.